మన్యం మనుగడ ఏటూరు నాగారం
బహుజన్ సమాజ పార్టీ బీస్పి ఏటూరునాగారం మండల కన్వీనర్ ఎంపెళ్లి రాజు ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతి రావు పూలే జయంతి కార్యాక్రమాన్ని ఏటూరు నాగారం మండల కేంద్రంలో అంబెడ్కర్ విగ్రహం ముందు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి బిస్పి ములుగు అసెంబ్లీ అధ్యక్షులు ఎంపెళ్లి వీరస్వామి హాజరై మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సారధ్యంలో బిఎస్పి తోనే సాధ్యమని అన్నారు.బహుజన మహా త్ములైన జ్యోతిరావు పూలే, సాహుమహారాజ్,నారాయణ గురు,పెరియార్ ఇవి రామ స్వామినాయకర్,అంబెడ్కర్,వంటి మహనీయుల ఆశయాల పునాధులపైన ఏర్పాటుచేసిన బహుజన సమాజ్ పార్టీ తెలంగాణాలో ప్రభుత్వాలు చేసే మోసాలను,వివక్షలను,
ఎస్సీ,ఎస్టీ,బిసి,మైనారిటీ,పేదల అందరినీ డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సారథ్యంలో
చైతన్యం చేసి,ఏనుగు గుర్తు ద్వారా తెలంగాణ లో బహు జన రాజ్యాన్ని సాధిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో బిస్పీ మంగపేట మండల కన్వీనర్ గుళ్లగట్టు విజయా రావు,ఎం ఎస్ పి నాయకులు వావిలాల సాంబశివరావు,
స్వామి,సీనియర్ దళిత జిల్లా నాయకులు లంజపెళ్లి నర్సయ్య,ఎమ్మార్పీఎస్ నాయకులు సతీష్,సునీల్,
తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: