- 2018 నుంచి ఈరోజు వరుకు 786 చెక్కుల పంపిణీ. వాటి విలువ సుమారు 6కోట్లు రూపాయలు
ములకలపల్లి:మన్యం మనుగడ ప్రతినిధి :
ములకలపల్లి రైతు వేదిక వద్ద 42 కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఎన్నో కుటుంబాలకు ఊరట లభించిందని ములకలపల్లి మండలానికి 2018 నుంచి ఈరోజు వరుకు సుమారు 6కోట్ల రు విలువ చేసే 786 చెక్కులు ఇచ్చారని ఆడబిడ్డ కి తండ్రిగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని,నియోజకవర్గ ప్రజల క్షేమమే నా లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఎల్ వీరభద్రం,ఎంపిడివో చిన నాగేశ్వరావు, ములకలపల్లి టీఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మొరంపూడి అప్పారావు, ములకలపల్లి జెడ్పిటిసి సున్నం నాగమణి,ఎంపిపి మట్ల నాగమణి,ములకలపల్లి ఎంపిటిసి మెహ్రా మణి,ములకలపల్లి సర్పంచ్ బీబీనేని భద్రం,ఉప సర్పంచ్ జగన్నాధపురం సర్పంచ్ గడ్డం భవాని, ఎంపిటిసి సున్నం సునీత,సున్నం తులసి,సీతాయిగూడెం సర్పంచ్ కారం సుధీర్, మాధారం సర్పంచ్ వాడే నాగరాజు, తళ్లపాయసర్పంచ్ బైట రాజేష్, రాంచంద్రపురం సర్పంచ్ సున్నం సుధాకర్,సున్నం సుశీల,ములకలపల్లి టి ఆర్ ఎస్ పార్టీ మైనారిటీ అధ్యక్షులు సర్ధార్,ప్రవీణ్,రాజేష్, మండల అధికారులు,పాల్గొన్నారు స్థానీక టీఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: