మన్యం మనుగడ కథనానికి స్పందన
టెంట్, నీళ్లు, మెడికల్ కిట్ ఏర్పాటు
గుండాల /ఆళ్ల పల్లి ఏప్రిల్ 20(మన్యం మనుగడ): ఉపాధి హామీ కూలీలు ఎండలో పనులు చేస్తున్నారనే శీర్షిక న మన్యం మనుగడలో గత రెండు రోజులు గా ప్రచురించడం జరిగింది. ఈ కథనానికి స్పందించిన ఆళ్ల పల్లి ఎంపీపీ మంజు భార్గవి కూలీలు పని చేసే ప్రాంతంలో టెంట్, మంచినీళ్లు, మెడికల్ కిట్ ను ఏర్పాటు చేశారు. ఆళ్ల పల్లి, మర్కోడు ప్రాంతాల్లో జరిగే ఉపాధి హామీ కూలీల కష్టాలను గమనించిన ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు సౌకర్యాలను కల్పించారు. ఈ సౌకర్యాల కోసం మర్కోడు సర్పంచ్ శంకర్ బాబు చేసిన కృషి సైతం అభినందనీయమని ఎంపీపీ అన్నారు. మంచినీళ్ల సౌకర్యం కోసం 20 లీటర్ల వాటర్ బాటిల్స్ అందించిన నరెడ్ల ప్రవీణ్ కు ఎంపీపీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు . ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహారావు. నాయకులు ఖయ్యుం, నరెడ్ల, కృష్ణ , కిషోర్ బాబు, యువజన విభాగం అధ్యక్షులు సతీష్ , కృష్ణ , మండల సోషల్ మీడియా అధ్యక్షులు కంచర్ల సందీప్, నరేష్ , గ్రామ కమిటీ అధ్యక్షులు నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: