మన్యం మనుగడ వాజేడు /
వాజేడు మండలం తహశిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెవెన్యూ సంబంధిత అంశాలపై దృష్టి పెట్టాడు.
ప్రజలు ఎటువంటి ఇబ్బందులకూ గురి కాకుండా చర్యలు చేపట్టనున్నట్లు తహసీల్దార్ సర్వర్ పాష అన్నారు. నూతన తహసీల్దార్కు వాజేడు టీఎస్ మీడియా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం మీడియా మిత్రులు శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో తహసిల్దార్ మట్లాడుతూ.. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు సత్వర చర్యలను చేపట్టాలని సూచించారు.పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహాసిల్దార్ రాహుల్ చంద్ర వర్మ, ఆర్ ఐ. కిసరి రాజు, మీడియా మిత్రులు రాజు, (మన తెలంగాణ) సిద్దబోయిన సర్వేశ్వరరావు, (మన్యం మనుగడ) నాగేంద్రబాబు (తెలంగాణ కేసరి) కుమార్ (మెట్రో న్యూస్) అజయ్, కిషోర్,(తెలంగాణ కిరణం) లక్ష్మణ్, (ప్రజా నిజం)(సామాజిక సారధి) రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.
Post A Comment: