CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కను నాటిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు తన జన్మదినం సందర్భంగా శనివారం నాడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా పలు రకాల మొక్కలు నాటడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషం అని, ఇది పర్యావరణ పరిరక్షణకు ఒక నిజమైన చాలెంజ్ అన్నారు ఎందుకంటే ఆక్సిజన్ కేంద్రాలు నెలకొల్పే పరిస్థితి మనకు వచ్చింది అంటే మనం మొక్కలు నాటడం,పెంచడం బాధ్యతగా తీసుకోవాలి. మొక్కలు నాటిన వాటిని సం రక్షించడం వల్ల నేలతల్లికి అలాగే మన సమాజానికి ఎంతో ఉపయోగకరమని, మనమందరం ఆరోగ్యకరంగా ఉండాలంటే మొక్కలు నాటడం చాలా అవసరమని కాబట్టి అందరం కూడా మొక్కలు పెంచే బాధ్యత తీసుకోవాలన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక హరితహారానికి మద్దతుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టి ప్రజలలో మంచి అవగాహన కల్పిస్తూ,చెట్లు నాటే విధంగా ప్రోత్సహిస్తున్నారు.ఇంతటి అద్భుతమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు ఎంపీ, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినిపల్లి సంతోష్ కుమార్ కి,ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మణుగూరు మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు,యువజన నాయకులు,టిఆరేస్వి నాయకులు,అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: