మన్యం మనుగడ, మంగపేట.
జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం ఇర్కచెడు గ్రామంలో దళితులు ఏర్పాటు చేసిన ప్రపంచ మేదావి భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించడం అతి దారుణమని తెలంగాణ మాలమహానాడు ములుగు జిల్లా అధ్యక్షుడు కర్రీ శ్యాంబాబు అన్నారు. అంబేద్కర్ ఏ ఒక్క కులానికో మతానికో చెందిన వారు కాదని ఆయన అందరివాడని దేవుడిలా కొలవాల్సిన భారత రాజ్యాంగ పిత అంబేద్కర్, ఆయనకు ఒక విగ్రహం పెట్టడం లో తప్పేముంది.అంబేద్కర్ లేకపోతే ఈ రోజు భారత దేశం దిశా నిర్ధేశం లేకుండా పక్కనే ఉన్న ఉగ్రవాద దేశాల సరసన చేరేది. భారత దేశానికి వన్నె తెచ్చిన మహానుభావులు అటువంటి అంబేద్కర్,ఆయన విగ్రహాన్ని దగ్దం చేయగలరేమో కానీ ఆయన భావజాలాన్ని మాత్రం ఏమి చేయలేరని అన్నారు.ఈ దుర్మార్గానికి పాల్పడిన వారిని తక్షణమే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఇలాంటి సంఘటనలకు పాల్పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కోరారు.
Post A Comment: