CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పెరిగిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి.కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్‌ హుసేన్.

Share it:

 


మన్యం మనుగడ కరకగూడెం:ఏఐసీసీ,పీసీసీ మరియు డీసీసీ అధ్యక్షుల అదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోనీ అంబేద్కర్ విగ్రహం వద్ద పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, ధరలను మరియు విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుసేన్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రోజు రోజుకి పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారు అని అన్నారు.కేంద్రప్రభుత్వం సామాన్య ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్,నిత్యావసర ధరలు పెంచినట్లు రైతులు పండించిన పంటలకు మద్దతు ధరను కల్పిస్తే బాగుంటుందని కేంద్ర ప్రభుత్వానికి కోరారు. అదే విధంగా విద్యుత్ చార్జీలు పెంచినందున సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికైనా పెంచినటువంటి పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర ధరలు మరియు విద్యుత్ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కొరుతున్నానని,లేనియెడల కాంగ్రెస్ పార్టీ పేదలకు ఎల్లప్పుడూ అండగా ఉండి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు, మండల యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్,మండల కార్యదర్శి షేక్ రఫీ, సీనియర్ నాయకులు కొరగట్ల అర్జున్, కొరగట్ల విశ్వనాధం, పోలేబోయిన సుజాత, పూనెం.సరిత,పడిగ అశోక్,చర్ప.నాగార్జున,ఈసం రవీందర్,చెన్నూరి రవీంద్ర, బాడిష గంగరాజు,షేక్ హైమద్,యువజన నాయకులు సాయి,సాకేత్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: