గుండాల/ఆళ్లపల్లి ఏప్రిల్ 10 (మన్యం మనుగడ) ఆళ్ల పల్లి మండలంలో ఘనంగా సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు మర్కోడు గ్రామంలో రాములోరి కల్యాణాన్ని కన్నుల పండుగగా కమిటీ సభ్యులు జరిపారు. అనంతరం రెండు గ్రామాల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆళ్ల పల్లి మండల కేంద్రం లో రామాలయం వద్ద వ్యాపారస్తులు గౌరిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమానికి మండల కేంద్రంలోని భక్తులతోపాటు వివిధ గ్రామాల ప్రజలు హాజరై అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
Post A Comment: