మన్యం మనుగడ, మంగపేట.
గురువారం సాయంత్రం మొదలైన అకాల గాలి వాన కొద్ది కొద్దిగా పెరిగి బీభత్సం సృష్టించించింది. మంగపేట మండలం శనగకుంటలో గాలి భీభత్సానికి నిప్పురవ్వలు ఎగసిపడి ప్రమాదవశాత్తు సుమారుగా 25 ఇండ్లు పూర్తిగా కాలిపోయినవి. అడవిలో ఆదివాసీగూడెం మన్యం ప్రజలు ఆర్తనాదాలతో అడవి హోరెత్తిపోయింది కళ్ళముందే తమ సర్వం ఆస్తులు కాలిపోతుంటే ఆదివాసీ ప్రజలు ఏడ్చి ఏడ్చి అలసిపోవడం తప్ప చేసేది ఏమిలేక తగలబడుతున్న తమ ఆస్తులను కాపాడుకోలేక చేష్టలుడిగి ఉండిపోయారు. గాలి చిలికి చిలికి పెనుదుమారంగా మారి ఏమి జరుగుతుంది అని తెలుసుకునే లోపల ఇండ్లకు అగ్ని అంటుకొని ఒక ఇంటి నుండి మరొక ఇంటికి అగ్నికీలలు వ్యాపించి అగ్నికి ఆహతి అయ్యాయి. ఇండ్లలో ఉన్న గ్యాస్ సిలిండర్ లు సైతం బాంబుల్లా పేలుతు ఉంటే ఇండ్లలో ఉన్న ఆస్తులను సైతం వదిలి ప్రాణాలు కాపాడుకోవడం తప్ప ఆదివాసీలు ఏమి చేయలేకపోయారు.సంఘటన స్థలాన్ని సందర్చిన డీపీవో వెంకయ్య, ఎంపీవో శ్రీకాంత్, మండలం తహసీల్దార్ ఎండి సలీం, ఎస్ ఐ తాహెర్ బాబా, వి ఆర్ ఓ క్రాంతికుమార్, సెక్రటరీ రూప్ సింగ్ ఘటన స్థలానికి చేరుకొని తక్షణమే స్పందించి పైర్ ఇంజన్లు రప్పించి తక్షణ సహాయం అందించినప్పటికి జరగవలసిన నష్టం జరిగిపోయింది సుమారుగా 70 లక్షలవరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చు అని అధికారుల అంచనా.కలెక్టర్ ఆదేశాల మేరకు ఒక్కో కుటుంబానికి 25 వేల రూపాయలు, నిత్యావసరాలు అందిస్తామని ఏ పి ఓ వసంతరావు తెలియజేశారు.
Post A Comment: