మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: తిప్పనపల్లి రామాలయ దేవస్థానం కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం ఆలయ స్థలప్రాంగణంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ఈ మేరకు ఎన్నికను ఏకగ్రీవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షునిగా లంకా నరసింహారావు,ఉపాధ్యక్షునిగా దరావత్ రామారావు,ప్రధాన కార్యదర్శిలుగా మచ్చా కుమార్, రామిశెట్టి సైదయ్య, గౌరవ అధ్యక్షులుగా మంచికలపూడి వెంకటేశ్వరరావు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ బాధ్యులు మాట్లాడుతూ..... ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అక్కడికక్కడే గ్రామస్తులు మూకుమ్మడిగా విరాళాలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గాదె లింగయ్య, పసుపులేటి మంగయ్య, అంచ అప్పారావు,చావా నాగేశ్వరరావు, ఆకుల శ్రీనివాసరావు, వేల్పుల ఉపేందర్, తాళ్లూరి వెంకటేశ్వరరావు, వేల్పుల రాము, అల్లం కిరణ్, సుంకర రామారావు, జ్యోతి దుర్గయ్య, అంచ యాకయ్య, రాంబాబు, నరసింహారావు, భోగి నాగేశ్వరరావు, ఓరుగంటి సీతారాములు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: