CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అర్ధరాత్రి రెచ్చిపోయిన మట్టి మాఫియా.ప్రభుత్వ నిబంధనలు కాలరాస్తున్న మట్టి మాఫియా..

Share it:

 




  • రాత్రి వేళల్లో అక్రమార్కులు జెసిబి, టిప్పర్లు లతో మట్టి తరలిస్తున్న వైనం.
  • తక్షణమే స్పందించిన తహసిల్దార్, రెవెన్యూ సిబ్బంది.


రాత్రి అయిందా మట్టి మాఫియాకు వేళాయ!

గుంటకాడ నక్కల ఎదురు చూస్తూ రాత్రి అయ్యిందంటే చాలు, మట్టి అక్రమార్కులు రెచ్చిపోయి ఇష్టారాజ్యంగా యథేచ్ఛగా నాలుగు టిప్పర్లు రెండు జెసిబి,తో వర్ధిల్లుతున్న వైనం,

వాజేడు మండలం చింతూరు గ్రామపంచాయతీలో ఈ ఘటన చోటు చేసుకుంది. మట్టి మాఫియా చెలరేగిపోయింది. అక్రమ మట్టితవ్వకాలను రెట్టింపు ఉత్సాహంతో విజృంభించింది. తక్షణమే రెవెన్యూ అధికారులు స్థానికుల వివరాల ప్రకారం.. చిత్తూరు గ్రామ పంచాయతీలో సొసైటీల ఇసుక క్వారీలు మంజూరు కావడంతో చింతూరు గ్రామంలో గత కొన్ని రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా రాత్రి సమయంలో రేసింగ్ కాంట్రాక్టర్లు మట్టి తవ్వకాలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో బుధవారం అర్థరాత్రి మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లుగా వాజేడు తహశీల్దార్‌ సర్వర్ పాషా, విఆర్‌ఒ శ్రీనివాస్, వి ఆర్ ఓ అమ్మాజీ రాణి, వీఆర్ఏ శ్రీలక్ష్మి, కి సమాచారం అందింది. తహశీల్దార్‌ ఆదేశాల మేరకు వీఆర్వోలు తన సిబ్బందితో చిత్తూరుకు వెళ్లి మట్టి తవ్వకాలను అడ్డుకున్నారు. మూడు టిప్పర్లను, జెసిపిని స్వాధీనం చేసుకున్నారు.

Share it:

TS

Post A Comment: