దమ్మపేట ఏప్రిల్ 07 గురువారం ( మన్యం మనుగడ ) : తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో రైతు నిరసన దీక్ష చేపట్టాలని టిఆర్ఎస్ పార్టీ అదినేత కేసీఅర్ పిలుపులో భాగంగా కొత్తగూడెం జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు పినపాక శాసనసభ్యులు రేగ కాంతారావు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట గల ధర్నా చౌక్ నందు చేపట్టిన నిరసన దీక్షకు హాజరైన అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఈ సందర్బంగా తెలంగాణ రైతులు పండించిన వడ్లు కొనుగులు పై కేంద్రం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ, రైతాంగం పండించిన వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ చేసి దీక్ష చేపట్టారు అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ గారికి అందచేశారు ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు మండల అధ్యక్షుడు దొడ్డాకుల రాజేశ్వరరావు అశ్వరావుపేట మండల అధ్యక్షుడు బండి పుల్లారావు మొదలగు వారు పాల్గొన్నారు.
Post A Comment: