CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఖమ్మం జిల్లా పబ్లిక్ & ప్రైవేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీవో కార్యాలయం ముందు ధర్నా .

Share it:

 



  •  ( ఏ.ఐ.ఆర్‌.టి.డబ్ల్యు.ఎఫ్‌ - సి.ఐ.టి.యు ) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రవాణా శాఖ అధికారి తోట కిషన్ రావు కు , వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ కు వినతి పత్రం .


ఖమ్మం : ప్రమాదాలు అరికడతామనే సాకుతో బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా మోటార్‌ వాహన చట్టం - 2019 అమలులోకి తెచ్చిందని , కేంద్రంలోని ఈ చట్టం రవాణారంగ కార్మికులు , ప్రజలపై అనేక భారాలను మోపుతున్నదని , ఇప్పటికే పెరిగిన పెట్రోల్‌ , డీజిల్‌ , గ్యాస్‌ ధరలతో రవాణారంగ కార్మికులు అనేక ఆర్థిక ఇబ్బందులను మరియు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు . దీనికి తోడు పుండు మీద కారం చల్లిన విధంగా ఏప్రిల్‌ 1 నుండి వివిధ రకాల పెనాల్టీలను భారీగా పెంచి , ముఖ్యంగా ఫిట్‌నెస్‌ రెన్యువల్‌ గడువు దాటిన ప్రతిరోజు రూ.50లు ఫైన్‌ చెల్లించాలని రూల్స్‌లో పేర్కొని . లక్షల సంఖ్యలలో ఉన్న వాహనాలపై ఫిట్‌నెస్‌ చేయించాలంటే వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని , ఇటీవల హైదరాబాద్‌ నగరంలో ఒక ఆటో కార్మికుడు ఫిట్‌నెస్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేస్తే లేట్‌ ఫీజు పేరుతో రూ . 47,350లు వచ్చిందని , దీంతో రవాణా కార్మికులు బెంబేలెత్తి పోతున్నారు . కావున గూడ్స్‌ వాహనంలో ఓవర్‌ లోడింగ్‌ ఉందన్న నెపంతో రూ.25,000లు ఫైన్‌ వేశారు . గతంలో రూ.1,000లు ఉండేది రెండు టన్నులు ఎక్కువ ఉందని రూ.2,000లు అదనపు ఫైన్‌ వేశారు . మొత్తంగా రూ.27,000లు ఫైన్‌ వేశారని కార్మికులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు . ఈ రకంగా ప్రస్తుతం ఉన్న పెనాల్టీలపై వందల రెట్లు పెంచి కార్మికుల వద్ద డబ్బులు గుంజుతున్నారు . హెల్మెట్‌ లేకపోతే రూ.1,000 లు , సీట్‌ బెల్ట్‌ లేకపోతే రూ.1,500 లు , లైసెన్స్‌ లేకపోతే రూ.2,000లు , యూనిఫామ్‌ లేకపోతే రూ.1,000 లు , వాహనం ఓవర్‌ స్పీడ్‌గా నడిపితే రూ.5,000 లు జరిమానాలు వేస్తున్నారని , వాహన ఇన్సూరెన్స్‌ లేకపోతే రూ.2,000లు...! రిజిస్ట్రేషన్‌ చేయని వాహనం నడిపితే గతంలో రూ.2,000లు జరిమానా ఉండేది , ఇప్పుడు వాహనం నడుపుతూ మొదటిసారి పట్టుబడితే రూ.5,000 లు , 2వ సారి పట్టుబడితే రూ.10,000లకు పెంచారు . లైసెన్స్‌కు అర్హులు కాని వారు ( వయస్సురీత్యా ) వాహనం నడిపితే గతంలో రూ 1,000లు జరిమానా ఉండేది . ప్రస్తుతం రూ.2,500లతో పాటు 3 నెలలు జైలు శిక్ష ఉంటుందనే నిబంధనలు పెట్టారు . ఈ పెంచిన పెనాల్టీలతో రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉన్న ఆటోలు , ట్రాలీలు , క్యాబ్‌లు , డిసిఎంలు , లారీలు , స్కూల్‌ బస్‌లు , అంబులెన్స్‌లు , ట్రాక్టర్‌లు , మినీ డిసిఎంలు , హైయర్‌ బస్‌లు , జెసిబిలు , ట్రక్కు కార్మికులు , సొంత వాహనదారులపై తీవ్రమైన ఆర్థిక భారాలు మోపుతున్నారు . దీని ప్రభావంతో రవాణారంగ కార్మికులు ఈ వృత్తి నుండి దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు .15ఏండ్లు దాటిన కమర్షియల్‌ ఈ పర్సనల్‌ వాహనాలను గడువు పూర్తయ్యిందనే పేరుతో స్క్రాప్‌ చేయాలని చట్టం తెచ్చారు . దీనియొక్క నష్టం కార్మికుల పైనే కాదు , స్వంత వాహనాలు కలిగిన వారి మీద కూడా ఉంటుంది . ఉదా : ఒక రిటైర్డ్‌ ఆర్‌టిఓ అధికారి మాట్లాడుతూ... నేను నా వాహనం కొని 15 ఏండ్లు దాటింది . ఆ వాహనం నేను ఇళ్ళు , ఆఫీస్‌కు మాత్రమే ఉపయోగించాను , లక్ష కిలోమీటర్లు కూడా దాటలేదు , అయినా ఇప్పుడు దానిని స్క్రాప్‌ చేయాలంటే నేను అన్నివిధాలా నష్టపోతున్నాను , ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏరకం గానూ సరికాదన్నారు . ఇలాంటి వాహనాలు లక్షల సంఖ్యలలో ఉంటాయి . ఇవి స్క్రాప్‌ చేస్తే వాటి స్థానాల్లో కొత్త వాహనాలు కొనాల్సి ఉంటుంది . కార్పొరేట్‌ కంపెనీలకు లాభాలు చేకూర్చడానికే బీజేపీ ప్రభుత్వం రవాణారంగ కార్మికులపై , ప్రజలపై ఈ రకమైన భారాలు మోపుతుందన్నారు . కరోనా కారణంగా గత రెండేండ్లుగా ఆటో, ట్యాక్సీ, గూడ్స్‌ కార్మికులకు సరైన కిరాయిలు లేవు . ఇప్పటికే లక్షలాది రవాణారంగ కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి . ఇక పెట్రోల్‌ ధర రూ.120లు , డీజిల్‌ ధర రూ.106లకి పెరిగాయి . మరోపక్క ఈఎంఐలు చెల్లించాలని ప్రయివేటు ఫైనాన్స్‌ కంపెనీలు ఒత్తిడి పెంచి వాహనాలను సీజ్‌ చేస్తున్నారు . పెరిగిన ధరలు, పెనాల్టీల వల్ల కనీసం ఈ కార్మికులు రోజుకు సగటున రూ.700లు కూడా సంపాదించలేక తమ వాహనాలు అమ్మివేసి ఇతర కూలీ పనులకు వెళ్ళాల్సిన దుస్థితిని అనుభవిస్తున్నారు . తెలంగాణ రాష్ట్రంలో 15లక్షల మంది రవాణారంగ కార్మికులు పని చేస్తున్నారు . ఈ కార్మికులు రోడ్డున పడకుండా , రవాణా రంగ రక్షణకై టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చొరవ చేయాలి . పెంచిన ఫిట్‌నెస్‌ , లైసెన్స్‌ తదితర ఫైన్లు రాష్ట్రంలో వసూలు చెయ్యమని , కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి . సింగరేణి బ్లాకులు అమ్మనీయకుండా , రైతుల ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని ఏవిధంగా పోరాడుతున్నదో , అదే పద్ధతిలో స్వయం ఉపాధిపై ఆధారపడి జీవిస్తున్న ఈ రవాణారంగ కార్మికులను , రవాణారంగాన్ని రక్షించుకోవడం కోసం అండగా నిలబడాలని కోరారు . అన్ని రాజకీయ పార్టీలను , కార్మిక సంఘాలను కలుపుకొని కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు . దేశంలో మొన్న రైతాంగం చేసిన చారిత్రాత్మక పోరాటం , నిన్న కార్మికవర్గం చేసిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె రవాణారంగ కార్మికులకు ఆదర్శం కావాలి . మన హక్కులు కాపాడుకోవాలన్నా , రవాణారంగాన్ని రక్షించుకోవాలన్నా , పెరిగిన పెనాల్టీలను వెనక్కి కొట్టాలన్నా మనకు పోరాటం తప్ప మరో మార్గం లేదని పిలుపునిచ్చారు . సి.ఐ.టి.యు ఇచ్చిన వినతి పత్రం ఖమ్మం జిల్లా రవాణా శాఖ అధికారి తోట కిషన్ రావు , వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ లు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామని అని తెలియజేశారు . ఈ కార్యక్రమంలో ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా ఉపేందర్ , సి.ఐ.టి.యు జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణ వెంకటేశ్వర , సి.ఐ.టి.యు జిల్లా ఉపాధ్యక్షులు మాచర్ల గోపాల్ , సి.ఐ.టి.యు జిల్లా ఉపాధ్యక్షులు తిరుమల చారి , సి.ఐ.టి.యు జిల్లా నాయకులు బొట్ల సాగర్ , ఆటో యూనియన్ నాయకులు భద్రం , పొన్న ఉపేందర్ , దుర్గం , టీ.నాగేశ్వరావు , ఎస్కే. యాసీన్ , సంపత్ గౌడ్ , రామ్మూర్తి , ట్రాక్టర్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ధరావత్ రాందాస్ మరియు ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: