మన్యం మనుగడ కరకగూడెం: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తీసుకువచ్చిన పథకం మన ఊరు-మన బడి అని కరకగూడెం ఎంపీపీ రేగా కాళికా అన్నారు. ఈ మేరకు ఆమె మంగళవారం మండల పరిధిలోని బట్టుపల్లి,కరకగూడెం, తుమ్మలగూడెం,రేగళ్ల ఎంపీపీఎస్ ప్రభుత్వ పాఠశాలకు మన ఊరు మన బడిలో భాగంగా సుమారు 38,27,662 లక్షల రూపాయల నిధులతో మంజూరైన పనులను అధికారులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల జోలికి పోకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యనభ్యసించేలా చూడాలన్నారు. మరోవైపు పూర్వ విద్యార్థులు, ఎన్ఆర్ఐలు, గ్రామానికి చెందిన వారు విరాళాలు సమకూర్చి పాఠశాలలకు అందిస్తే మరింత అభివృద్ధిని చేస్తామన్నారు.దాతల పేర్లు, ఫొటోలు పాఠశాలల్లో ప్రదర్శిస్తామని తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన నిధులతో పాఠశాలల రూపురేఖలే మారుతాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో పినపాక ఎంఈఓ వీరస్వామి, ఎంపిఓ చిరంజీవి,ఆర్ఐ రాజు, కరకగూడెం ఎంపీపీఎస్ హెచ్ఎం తిరుపతమ్మ,ఎస్ఎంసీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: