CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఆటోడ్రైవర్లకు అవగాహన కార్యక్రమం. ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చాలి --:ఏడూళ్ల బయ్యారం సిఐ రాజగోపాల్

Share it:


మన్యం మనుగడ, పినపాక: 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్ లో సిఐ రాజగోపాల్ ఆధ్వర్యంలో ఆటోడ్రైవర్లకు ట్రాఫిక్ కు సంబంధించిన నియమ నిబంధనల గురించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. పట్టణం, గ్రామాల్లో ప్రయాణికులకు సేవలందించే ఆటో డ్రైవర్లు విధిగా నిబంధనలు పాటించాలని సిఐ రాజగోపాల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినా, వారిపై అమర్యాదగా ప్రవర్తించినట్లు తమ దృష్టికి వస్తే చర్యలు తప్పవన్నారు. నిబంధనల మేరకు ప్రయాణికులను ఎక్కించుకోవాలని, ధనాపేక్షతో కాకుండా, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అన్నారు. వాహన పత్రాలు ఆందుబాటులో ఉంచుకోవాలన్నారు. లేకుంటే చట్టపరంగా ఆపరాధ రుసుం విధిస్తామని సిఐ తెలిపారు. వివిధ మార్గాల్లో సంచరించే ఆటోల వివరాలను ఆయా స్టాండ్‌ల వద్ద ఏర్పాటు చేసుకోవాలని సిఐ సూచించారు. ఆవగాహన సదస్సులో ఎస్సైలు టి.వీఆర్ సూరి , ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: