మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలం గంపోనిగూడెం గ్రామానికి చెందిన చల్ల వెంకటరమయ్య కుమారుడైన చల్ల వెంకటేశ్వర్లు గత కొద్దిరోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతున్నవిషయం తెలుసు కొని చల్లా వెంకటేశ్వర్లును వారి ఇంటికి వెళ్లి పరామర్శించి,మనోధైర్యాన్ని కోల్పోవద్దని చెప్పి పార్టీ పరంగా ఆదుకుంటామని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మంగపేట కుడుముల లక్ష్మీ నారాయణ ఈ సందర్బంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మంగపేట గ్రామ కమిటీ అధ్యక్షులు నూనె లింగయ్య, మండల మైనార్టీ అధ్యక్షులు అఫ్జల్, కమలాపురం గ్రామ కమిటీ అధ్యక్షులు తుక్కని శ్రీనివాస్, మండల సోషల్ మీడియా ఇంఛార్జ్ గుడివాడ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: