గుండాల ఏప్రిల్ 3(మన్యం మనుగడ) ప్రగతిశీల యువజన సంఘం (పి వై ఎల్) బలోపేతానికి ముందుండి పనిచేస్తానని పి వై ఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన వాంకుడోత్ అజయ్ అన్నారు. మార్చి 30, 31 తారీకులో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో లో పి వై ఎల్ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం జరిగిందన్నారు సమావేశంలో వాంకుడోత్ అజయ్ ను ఉపాధ్యక్షునిగా ఎనుగంటి గణేష్ రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఎన్నిక యామని ఆయన పేర్కొన్నారు. దేశంలోని బిజెపి ప్రభుత్వం సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాటి ఊసే ఎత్తడం లేదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగ నియామకాలను పరిచిందని అన్నారు. ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాలను నోటిఫికేషన్ లిచ్చి నియామక ప్రక్రియ చేపట్టాలని అన్నారు. జార్జి రెడ్డి 50 వర్ధంతిని హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున చేస్తామని ఆయన అన్నారు
Post A Comment: