మన్యం మనుగడ వాజేడు.
వరంగల్ పట్టణానికి చెందిన డాక్టర్ నరహరి సీతారామరాజు నాలుగు సంవత్సరాలుగా వాజేడు మండలం పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న వైద్యాధికారి సీతారామరాజు అతి తక్కువ కాలంలోనే జిల్లా మలేరియా ఆఫీసర్ గా సేవలు అందించిన డాక్టర్ సీతారామరాజు మాస్టర్స్ డిగ్రీ రావడంతో, ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య సిబ్బంది మరియు ప్రజా ప్రతినిధులు, మీడియా మిత్రులు ఘనంగా సన్మానించారు.పేద కుటుంబానికి చెందిన ఎన్నో కష్టాలు ఆర్థిక ఇబ్బందులను తట్టుకుని ఉన్నత చదువులకు పేదరికం అడ్డుకాదని నిరూపిస్తూ ఎంబిబిఎస్ డాక్టర్ విద్య నభ్యసించి మారుమూల ప్రాంతమైన పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వెలలేని సేవలందించిన డాక్టర్ సీతారామరాజు పలువురు వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా.. హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వేణు మాట్లాడుతూ.. డాక్టర్ సీతారామరాజును
విద్యార్థినీ విద్యార్థులు యువకులు ఆదర్శంగా తీసుకుని ఉన్నత విద్యను చదివి మండలానికి గ్రామానికి పేరు తీసుకురావాలని, మన మండల ప్రజలకు మన వంతు బాధ్యతగా సేవ చేయాలని సీతారామరాజు పట్టుదల దీక్షను కొనియాడడం జరిగింది. భవిష్యత్తులో గ్రామ ప్రజలకు ఎటువంటి సహాయం కావాలన్నా డాక్టర్ సీతారామరాజు ఎక్కడ ఉన్నా ఏ స్థాయిలో ఉన్న తన వంతుగా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ యాలం సరస్వతి ప్రాథమిక వైద్య సిబ్బంది, ప్రతినిధులు మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: