మన్యం టీవీ మణుగూరు:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు రేగా. కాంతారావు జన్మదినాన్ని పురస్కరించుకుని కొండాపురం భూగర్భ గని టిబిజికేయస్ ఫిట్ సెక్రటరీ నాగేల్లి ఆయన మిత్రులైన ఈర్ల.రాజేష్,హజీజ్, వెంకన్న మారుమూల గిరిజన ప్రాంతమైన బుగ్గ గ్రామానికి వెళ్లి ఆ గ్రామంలో పదవ తరగతి చదువుకుంటున్న పిల్లలకు ఫ్యాడ్స్,పెన్నుల తో పాటు అక్కడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నందు విద్యను అభ్యసిస్తున్న చిన్నారులకు నోట్ పుస్తకాలు,ఫ్యాడ్స్, పెన్నులు,స్కెల్స్, రంగు పెన్సిళ్ల డబ్బాలను అందించి చిన్నారులతో కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు. ప్రతి చిన్న పిల్లల్లో భగవంతుడు దాగి ఉంటాడని ఎటువంటి కల్మషాలు లేకుండా ఉండే గిరిజన చిన్న పిల్లలను సంతోషంగా ఉంచితే భగవంతుని కృపా కటాక్షాలు విప్ రేగా కు అందుతాయని వారు ఆకాంక్షించారు.విద్య కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే రేగా కాంతారావు పుట్టినరోజు నాడు చిన్నారుల విద్య కు అవసరమైన మెటీరియల్ ను అందించడం ఎంతో సంతోషాన్ని అందించిందని వారు తెలిపారు.విప్ రేగా పాలన తో ప్రజానీకం సుభిక్షంగా ఉండాలని రానున్న కాలంలో ఆయన మరింత ఉన్నత పదవులు అధిరోహించి పరిపూర్ణ మైన ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా వారు కోరుకున్నారు.ఈ కార్యక్రమం లో ఈర్ల.రాజేష్,హజీజ్, బంగారి.పవన్,గుంజ వెంకన్న, గ్రామ పెద్దలు బాలరాజు పాల్గొన్నారు.
Post A Comment: