మన్యం టీవీ మణుగూరు:
మిస్సైల్ మాన్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ మణుగూరు వారి ఆధ్వర్యంలో మణుగూరు ప్రధాన కూడలి అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆదివారం నాడు మణుగూరు పట్టణ సీఐ ముత్యం రమేష్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి జీవి జీవించటానికి త్రాగునీరు ఎంతో ముఖ్యమని,వేసవిలో దీని అవసరం మరీ ఎక్కువగా ఉంటుందని,చలివేంద్రాలు ఏర్పాటు చేసి,ప్రజల దాహార్తిని తీర్చే సామాజిక సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న *మిస్సైల్ మెన్ హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్* సభ్యులను సి ఐ ముత్యం రమేష్ అభినందించారు. చలివేంద్రం కి సెలవులు ఇవ్వకుండా వేసవి పూర్తి కాలం పరిశుభ్రమైన చల్లటి నీళ్లు ప్రజలకు అందజేయాలని ఆయన కోరారు.పరిసరాల పరిశుభ్రత మరువద్దని ఈ సందర్భంగా ఆయన వారికి గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హాండ్స్ సభ్యులు వినయ్,నాగేశ్వరరావు,హరీష్,సన్నీ,ప్రవీణ్,రాంబాబు,రాజేందర్,సాయి,సతీష్,ముంతాజ్, స్వాతి,అరుణా,రమాదేవి,సంధ్య మరియు సింగరేణి సేవా సమితి సభ్యులు నాసర్ పాషా మంగీలాల్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: