గుండాల/ ఆళ్ళపల్లి ఏప్రిల్ (మన్యం మనుగడ) మండల పరిధిలోని మారుమూల ఏజెన్సీ బూసరాయి గ్రామంలో ఇల్లందు డిఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో బూసరాయి గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి తగిన మందులు అందజేశారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న వారికి మెరుగైన వైద్యం కోసం పట్టణాల్లో ప్రభుత్వ వైద్య శాలల్లో చూయించుకోవాలని డిఎస్పీ సూచించారు. అటువంటి వారికి నా వంతు సహకారం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి సీఐ ఎ.వెంకటేశ్వర్లు, ఎస్సై, పోలీస్ స్టేషన్ సిబ్బంది కోటేష్, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: