మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: పోలీసులు అప్రమత్తతో ఏటీఎం చోరీ జరగకుండా ఏటీఎం దొంగలు పారిపోయిన సంఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ ఐ గొల్లపల్లి విజయలక్ష్మి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చండ్రుగొండ ప్రధాన సెంటర్లోని జాతీయ రహదారి ప్రక్కన గల డి సి సి బి బ్యాంక్ ఏటీఎం సెంటర్ వద్ద బుధవారం తెల్లవారుజామున ఇద్దరు వ్యక్తులు అటుగా వస్తున్న పెట్రోలింగ్ వాహనాన్ని గమనించి ద్విచక్ర వాహనం పై పారిపోతుండగా పోలీసులు వెంటబడిన చిక్కకుండా పారిపోయారు. పోలీసులు వెనక్కి వచ్చి చూడగా డిసిసిబి ఎటిఎం మిషన్ పగలగొట్టడానికి ప్రయత్నించినట్లు మిషన్ అద్దం పగిలిపోయి ఉండడాన్ని గమనించారు. దీంతో ఏటీఎం మిషన్ పగలగొట్టే సమయంలో పోలీస్ వాహనం శబ్దం వినపడి పారిపోయినట్లు నిర్ధారణ అవ్వడంతో వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడం జరిగిందని ఎస్ఐ విజయలక్ష్మి తెలిపారు.
Navigation
Post A Comment: