గుండాల ఏప్రిల్ 17(మన్యం మనుగడ) మండలంలోని యువతీ యువకులు పోలీసు ఉద్యోగాలు సాధించాలనుకునే వారు పోలీస్ శాఖ ద్వారా నిర్వహించబడే ఉచిత కోచింగ్ సెంటర్ లను సద్వినియోగం చేసుకోవాలని ఎస్ ఐ కిన్నెర రాజశేఖర్ ప్రకటనలో కోరారు. మండలంలోని ఆసక్తి గల యువతీ,యువకులు గుండాల పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలన్నారు అభ్యర్థి పేరు, తండ్రి పేరు చిరునామా మొబైల్ నెంబర్ దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఉచిత కోచింగ్ లో ను ఉపయోగించుకొని ఉద్యోగాల్లో స్థిరపడాలని ఆయన కోరారు
Post A Comment: