మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మనుబోతుల గూడెం గ్రామానికి చెందిన శెట్టిపల్లి శ్రావణి అనారోగ్యంతో బాధపడుతుండటంతో వారిని పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకొని తన జన్మదినం సందర్భంగా రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 50 వేల రూపాయల విలువ గల చెక్కును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గారు శనివారం నాడు బాధితురాలికి మండల ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లు, ప్రజా ప్రతినిధులు, యువజన విభాగం నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: