CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ముగిసిన రెండు జిల్లాల స్థాయి క్రికెట్ క్రీడలు.క్రీడలతో మానసిక ఉల్లాసం.

Share it:

 



  • క్రీడాకారులకు బహుమతులు అందజేసిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

మన్యం మనుగడ,కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మండల పరిధిలోని ముత్తారం గ్రామంలో గత పది రోజుల నుండి నిర్వహిస్తున్న స్వర్గీయ కరకగూడెం మండల వైస్ ఎంపీపీ పఠాన్ అయూబ్ ఖాన్ మెమోరియల్ మెగా క్రికెట్ రెండు జిల్లాల స్థాయి క్రీడాలు ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు హాజరై ముందు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం భనుడి ప్రతాపం లెక్కచేయకుండా క్రీడాకారులతొ కలిసి క్రికెట్ అడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు.ఈ క్రీడాలలో ప్రథమ బహుమతి పొందిన మణుగూరు జట్టు, ద్వితీయ బహుమతి పొందిన గొల్లగూడెం జట్టు మరియు తృతీయ బహుమతి పొందిన రఘునాదపాలెం జట్లకు బహుమతులు అందజేసినారు.అలాగే గెలిచిన క్రీడాకారులకు రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో గ్రామస్తల చేతులమీదుగా 10 వెల రూపాయల చెక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడుతుందని అన్నారు. క్రీడలతో నే స్నేహ భావం

పెంపొందుతుందని తెలిపారు. క్రీడాలతో పాటు చదువులలోకూడా మంచి ప్రతిభ చుపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగా కాళిక,బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొమరం రాంబాబు,మండల అధ్యక్షులు రావుల సోమయ్య,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు పాయం.రాజబాబు, క్రికెట్ నిర్వహకులు గుడ్ల రంజీత్ కుమార్,వడ్లకొండ వెంకటేశ్వర్లు,కల్తీ.నరేష్,వెంగలి,గోపి,టిఆర్ఎస్ పార్టీ నాయకులు రేగా సత్యనారాయణ,టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు జాడి రామనాథం,బుడగం రాము,పోగు.వెంకటేశ్వర్లు,నిట్టా.ఏడుకొండలు, నిట్టా.ప్రభాకర్, ఎంకట్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి సర్పంచ్ లు ఇర్ప.విజయ్ కుమార్, పాయం.నర్సింహారావు, పోలెబోయిన నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: