మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలంలోని తిమ్మంపేట గ్రామంలో రెండు రోజుల క్రితం ఒక గేదె కి గొంతు వాపు లక్షణాలు కనిపించాయని, దానికి చికిత్స చేయడం జరిగిందని,ఈ వ్యాధి మిగిలిన పశువులు కూడా గొంతు వాపు వ్యాధిన పడే అవకాశం ఉంది కాబట్టి ముందస్తు జాగ్రత్తగా గ్రామంలోని అన్ని పశువులకు గొంతువాపు వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేసుకోవటానికి పశుపోషణ యజమానులు విధిగా సహకరించాలని దీనికోసం సోమవారం అన్ని పశువులకు టీకాలు వేయడం జరుగుతుంది కావున రైతులందరూ తమ పశువులకు గొంతువాపు టీకాలు వేసుకోవాల్సినదిగా పశు వైద్యాధికారులు కోరారు.ప్రస్తుత సీజన్ లో పశువుల కు గొంతు వాపు వ్యాధి ప్రబలే అవకాశం ఉంది కాబట్టి పెంపకం దారులు తగిన జాగ్రత్త లు తీసుకుంటూ సత్వరమే చికిత్స చేయించాలని లేని పక్షం లో పశువులు మృత్యువాత పడే అవకాశం ఉందని తిమ్మంపేట గ్రామీణ పశు వైద్యశాల జూనియర్ పశు వైద్యాధికారిని తెలియజేశారు.
Post A Comment: