మన్యం టీవీ మణుగూరు:
ఉగాది శ్రీ శుభకృత్ నామ ఉగాది పురస్కారాల లో భాగంగా తెలంగాణ ఆర్ట్ గ్యాలరీ,రవీంద్ర భారతి హైదరాబాద్ నందు పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు లు కె.వి.రమణాచారి ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ఆదివాసి వనదేవతల అయినటువంటి సమ్మక్క సారక్క జీవిత చరిత్రను,తన కంచు మేళం కంచు తాళం వాయిద్య పరికరం తో చెప్పడంలో సకిని రామచంద్రయ్య దిట్ట అని, ఇటువంటి కళాకారులను గుర్తించి పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేయడం చాలా గర్వకారణం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పద్మ శ్రీ అవార్డు గ్రహీత,పద్మజ రెడ్డి,సకిని. బాబూరావు,తోలెం కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: