గుండాల ఏప్రిల్ 20(మన్యం మనుగడ) ఉపాధి హామీ పనిలో పనికి తగ్గ వేతనం పడట్లేదు ఉపాధిహామీ కూలీలు కార్యాలయం ముందు బైఠాయించారు. పనికి తగ్గ కూలీ క్రికెట్ లేదని బుధవారం ఉపాధి హామీ పని నిలుపుదల చేసి కార్యాలయానికి చేరుకొని అధికారులతో వాగ్వాదానికి దిగారు. అక్కడికి చేరుకున్న ఎంపీడీవో హజ్రత్ వాలి ఉపాధిహామీ కూలీల తో మాట్లాడుతూ డిసెంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉందని జనవరి నుండి కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వెళ్ళింది అన్నారు కొత్త సాఫ్ట్వేర్ రూపకల్పన చేసి పని సమయాన్ని వారు నిర్ణయించారని ఉదయం నుండి 11 గంటల వరకు తప్పనిసరిగా పనిచేయాలని మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు పని సమయాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వారు చేసిన పనికి మెజర్మెంట్ చేసి డబ్బులు ఇవ్వడం జరుగుతుందని ఎక్కువ తక్కువ ఉండదని ఆయన అన్నారు. కూలీలు సూచించిన మాదిరి పని జరిగే ప్రదేశంలో మంచి నీరు సెంట్ ఏర్పాటు చేస్తామని వారు హామీ ఇవ్వడంతో అక్కడి నుండి వెళ్ళిపోయారు
Post A Comment: