మన్యం మనుగడ : జూలూరుపాడు, ఏప్రిల్ 26, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం ప్రకాశం స్టేడియంలో మంగళవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జూలూరుపాడు మండలానికి చెందిన దళిత బంధు పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు ట్రాక్టర్లు, ఇతర యూనిట్లకు పెట్టుకొన్న లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చౌడం నరసింహారావు, ఎంపీపీ లావుడియా సోనీ, జెడ్ పి టి సి భూక్య కళావతి, జిల్లా నాయకులు యల్లంకి సత్యనారాయణ, వైస్ ఎంపీపీ గాదె నిర్మల, మోదుగు రామకృష్ణ, రామ్ శెట్టి రాంబాబు, వేల్పుల నరసింహారావు, ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు పణితి వెంకటేశ్వర్లు, చాపల మడుగు రామ్మూర్తి, రామారావు, తిరుపతి, బోడా నాగరాజు, అధికారులు మండల నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: