CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నల్ల జెండాలు,బ్యాడ్జిలతో నిరసనలు తెలిపిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు, ప్రజాప్రతినిధులు.

Share it:

 


మన్యం మనుగడ కరకగూడెం: కేంద్ర బిజెపి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతులు పండించిన వారిధాన్యాన్ని కొనుగోలు చెయ్యాలని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు, ఆదేశానుసారం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశానుసారం కరకగూడెం మండలం లో అన్ని గ్రామ పంచాయతీ లలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య,సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు పాయం నరసింహారావు, ఆధ్వర్యంలో ప్రతి రైతు ఇంటి పై నల్లజెండాలతో నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పై కక్ష సాధింపులు చేస్తుందని అన్నారు.రాష్ట్రంలో పండిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని లేనిపక్షంలో రైతులతో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అన్నారు, కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ ,గ్యాస్ డిజిల్ ధరల పెరుగుదల వలన ప్రజలపై భారం పడుతుంది అన్నారు. తెలంగాణ రాష్ట్ర లో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేసే వరకు భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని బిజెపి ప్రభుత్వన్ని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ డైరెక్టర్ కొంపెల్లి పెద్ద రామలింగం బైరి శెట్టి చిరంజీవి కొంపెల్లి చిన్న రామలింగం సోషల్ మీడియా అధ్యక్షులు చిట్టీమల్ల ప్రవీణ్ సీనియర్ నాయకులు దాసరి సాంబశివరావు,ఎల్లగౌడ్ మహిళా నాయకురాలు ఎస్ కె కమ్రున్, బాలయ్య, రాంబాబు, యువజన ప్రధాన కార్యదర్శి నిట్ట.సందీప్,నిట్ట ఆనందరావు,వినోద్ సాంబయ్య,రామకృష్ణ,రమేష్ సాంబశివరావు,రాఘవులు, తదితరులు.

Share it:

TS

Post A Comment: