CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గ్రామాల అభివృద్ధికి కృషి.మండలంలో పలు గ్రామాల్లో ప్రభుత్వ విప్ సుడిగాలి పర్యటన.

Share it:


మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం లోని పలు గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సుడిగాలి పర్యటన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం లోని బట్టిలగుంపు గ్రామ పంచాయతీ లోని పాముల పల్లి గ్రామం, పాములపల్లి కాలనీ, అమ్మ గారి పల్లి గ్రామ పంచాయతీలోని కుమ్మరిగూడెం గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సోమవారం నాడు విస్తృతంగా పర్యటించి ప్రజలతో ముఖాముఖి ఏర్పాటు చేసి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,స్థానిక ప్రజలతో ముఖాముఖి ఏర్పాటు చేసి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలు వారి దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి చరవాణిలో సంబంధిత అధికారులతో మాట్లాడుతూ వీలైనంత త్వరలో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. మండలం లో ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ఆయన స్థానికులను కోరారు, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గత 70 ఏళ్లు ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణలో అభివృద్ధి లేదు, కానీ కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక , అనేక సంక్షేమ పథకాలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్మించిన కాళేశ్వరం ద్వారా సాగునీరు అందించడం తో తెలంగాణ రాష్ట్రంలో సాగునీరు విస్తీర్ణం పెరిగింది, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు ఉచితంగా అందించడం తో తాగునీటి కష్టాలు తీరాయని తెలిపారు.రైతుబంధు పథకం ద్వారా, రైతులకు పెట్టుబడి ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుందని అన్నారు.త్వరలోనే పింఛన్లు , సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు లు మంజూరు అవుతాయని, ఎవరు అధైర్య పడొద్దని, ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కోడి అమరేందర్, ప్రధాన కార్యదర్శి మరి మల్లారెడ్డి, , మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, ఎంపీటీసీ లు తాటి పూజిత, ఎనీక రవి, చిలక వెంకట్రామయ్య, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు వెన్న అశోక్, ఎస్సీ సెల్ అధ్యక్షులు గొర్రెముచు వెంకటరమణ, ఎస్ టి సెల్ అధ్యక్షులు కొరస దుర్గారావు, బీసీ, యువజన విభాగం ఉపాధ్యక్షులు లంకల రమేష్,నియోజకవర్గ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మంగళగిరి రామకృష్ణ , మండల టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు గద్దల రామకృష్ణ,అశ్వాపురం మండలం టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, సోషల్ మీడియా సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: