CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మావోయిస్టు సభ్యుడు లొంగుబాటు.ఏటూరు నాగారం ఏఎస్పీ అశోక్ కుమార్ ఎదుట లొంగుబాటు.

Share it:

 


మన్యం మనుగడ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏసీపీ అశోక్ కుమార్ ఎదుట భూపాల పల్లి జిల్లా చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన మావోయిస్టు దళ సభ్యుడు మాచర్ల గణపతి అలియాస్ నరేందర్ లొంగిపోయాడు.లొంగిపోయిన గణపతి పార్టీలోని దుశ్చర్యలు, పార్టీలో కిందిస్థాయి వారిని పైస్థాయి వారు చులకనగా చూడడం తో పాటు అమాయ కులైన గిరిజనులను అత్యాచా రాలకు పాల్పడుతుండడమే కాక వెట్టిచాకిరి చేయిస్తారని అందుకే పార్టీ సిద్ధాంతాలు నచ్చకనే తమకు లొంగిపోయి నట్టుగా ఏఎస్పి అశోక్ కుమార్ అన్నారు.గణపతి లొంగు బాటు కు సహకరించిన వెంకటాపూర్ సిఐ శివప్రసాద్,ఎస్సై తిరుపతి అభినందించారు.దళ సభ్యుడు మాచర్ల గణపతి మీడియాతో మాట్లాడుతూ.చర్ల దళం శబరి ఏరియా లో దళ సభ్యుడిగా పని చేస్తూ పలుమార్లు లొంగి పోయి తిరిగి దామోదర్ అలియాస్ చొక్కారావు మాట లకు ఆకర్షితున్నై దళంలో చేరి పార్టీ తో కలిసి దగ్గరగా ఉండ డంతో అదే క్రమంలో కొన్ని రోజుల్లోనే పార్టీ సిద్ధాంతాలు నచ్చక అగ్ర నాయకులు కింది స్థాయి వాళ్లను చులకనగా చూడడం వారి బట్టలు, బ్యాగులు ఉతికించడం లాంటివి చేస్తూ అమాయక గిరిజనులను బలి చేయడం అత్యాచారాలకు పాల్పడడం లాంటివి చేసేవారని అంతేకాక కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చేయడం లాంటి దుశ్చర్యలకు పాల్పడే వారు అవన్నీ నాకు నచ్చక లొంగిపోయినట్లు దళ సభ్యుడు గణపతి తెలిపాడు.ఈ కార్యక్రమంలో వెంకటాపురం సీఐ శివప్రసాద్,ఎస్సై తిరుపతి,39 సీఆర్పీఎఫ్ కమాండెంట్ గైదన్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: