గుండాల ఏప్రిల్ 11(మన్యం మనుగడ) సిపిఐ ఎంఎల్ ప్రజా పంధా గుండాల మండల కార్యదర్శి ఈసం శంకరన్న ఆచూకీ తెలియడం లేదని ప్రజా పందా నాయకులు కోరం శాంతయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివారం ఇంటినుండి ఆళ్లపల్లి మండలానికి బయలుదేరిన అతను ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళాడు తెలియడంలేదని అన్నారు. అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉందని ఆయన అన్నారు శంకర్ అన్న ను పోలీసులు కిడ్నాప్ చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశామని ఆయన పేర్కొన్నారు. శంకరన్న ను ఎక్కడున్నా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఈసం సింగయ్య, సనప కుమార్, పూనెం మంగయ్య, కోడూరి జగన్, గుర్రం పుష్ప రాజ్, ఈసం కృష్ణ , కుంజ్జ నరేష్ , తేల్లం రాజు, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: