గుండాల ఏప్రిల్ 18(మన్యం మనుగడ) రాష్ట్ర ప్రభుత్వం గత నెల 25 వ తారీఖున టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిందని 17 రోజులే సమయం ఉండటంతో అధిక మొత్తంలో ఆన్లైన్ చేయడం వలన సాంకేతిక సమస్య ఏర్పడి కొందరు దరఖాస్తు చేసుకోలేకపోయారు అన్నారు అలాంటివారిని పరిగణలోకి తీసుకొని సమయం పొడిగించాలని పీ వై ఎల్, పిడిఎస్యు ఆధ్వర్యంలో కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ కు వినతిపత్రం ఇచ్చారు. దరఖాస్తు చేసుకున్న వారిలో సైతం అనేక తప్పులు వచ్చాయని సరిచేసుకునేందుకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో లో పి వై ఎల్ రాష్ట్ర నాయకులు రవి, పిడిఎస్యు రాష్ట్ర నాయకులు వినోద్ కుమార్, శ్యామ్ కుమార్, ఇర్ప రాజేష్ జిల్లా నాయకులు శశి కుమార్, పవన్, రాము తదితరులు పాల్గొన్నారు
Post A Comment: