గుండాల /ఆళ్ల పల్లి ఏప్రిల్ 7(మన్యం మనుగడ) ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మాతా శిశు ఆరోగ్యశాఖ జిల్లా అధికారిని సుజాత ఆదేశించారు. గురువారం ఆళ్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. గర్భిణీలకు, బాలింతలకు పోషకాహార లోపం తలెత్తకుండా వారికి అవగాహన కల్పించాలని ఆమె కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్య సిబ్బంది పాల్గొన్నారు
Post A Comment: