కరోనా మొదటి, 2nd వేవ్ నుండి ఆపత్కాలంలో పలువురి కి ఆక్సిజన్ అందించి ప్రాణాలను నిలుపుతున్న జే.డీ ఫౌండేషన్ ఆక్సిజన్ బ్యాంక్, మరొకసారి తమ ఔదార్యం చాటుకున్నారు. ఇప్పటికే భద్రాచలం, చుట్టుపక్కల గ్రామాలకు ఆక్సిజన్ సిలిండర్లు, మరియు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ లు అందజేస్తున్న పౌండేషన్ తాజాగా భద్రాచలం రె.వెన్యూ కాలనీ కి చెందిన 72 సంవత్సరాల గంగినేని రమణయ్య శ్వాస ఇబ్బందులు ఎదురవడం తో అత్యవసర పరిస్థితిలో వారి కుటుంబసభ్యులు తెల్లవారుజామున జే.డీ ఫౌండేషన్ ని సంప్రదించగా తక్షణమే ఫౌండేషన్ సభ్యులు కడాలి నాగరాజు,యూసుఫ్ మియా ల ద్వారా ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ ను వారి బంధువు రాకేష్ కి అందించడం జరిగింది. అడిగిన వెంటనే లేదనకుండా తక్షణమే స్పందించి తమకు సాయం చేసి ఆదుకున్నందుకు రమణయ్య కుటుంబం జే.డీ పౌండేషన్ భాద్యుడు మురళీమోహన్ కుమార్ కి,ఫౌండేషన్ కి కృతజ్ఞతలు తెలిపారు.
Navigation
Post A Comment: