గుండాల ఏప్రిల్ 2 (మన్యం మనుగడ) రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలైన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన గుర్రం మహేష్ గుండాల నుండి సాయనపల్లి వెళుతుండగా మల్లన్న వాగు వద్ద అదుపు తప్పి కింద పడడంతో గాయాలపాలయ్యాడు గమనించిన వాహనదారులు 108 కి సమాచారం ఇవ్వడంతో 108 వాహనంలో లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం తరలించారు
Post A Comment: