- కోతపల్లి ఆశ్రమ పాఠశాల సందర్శన.
మన్యం టివి దుమ్ముగూడెం::
రామచంద్రునిపేట పాఠశాల విద్యార్థిని మడకం ఇర్మమమ్మ మృతి చెందిన సంఘటన తో ఈరోజు డి డి రమాదేవి వారి గ్రామం లో పర్యటించారు కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. వారి కుటుంబానికి ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ సూచనలతో ఆర్థిక పరమైన సహాయం చేయుటకు సిద్ధంగా ఉన్నామని వారి కుటుంబానికి భరోసా కల్పించారు.అలానే ప్రతీ పాఠశాలలో బాలికలకు ప్రేరణ తరగతులు నిర్వహించాలని సంబంధించిన ఉప్పాద్యాయులకు సూచనలు జారీ చేశారు. అనంతరం కోతపల్లి పాఠశాలను సందర్శించారు 10 వ తరగతి విద్యార్థులతో సమావేశమై రానున్న పదోతరగతి పరీక్షలకు శ్రద్ధ గా చదివి మీ కుటుంబాలకి బాసటగా నిలవాలని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసిఎం రమణయ్య, ఏ టి డి ఓ నరసింహారావు , జి సి డి ఓ అలివేలు మంగతాయారు, హెచ్ఎం మడక మోతీర్ ,ఉపాధ్యాయులు సర్వేశ్వరరావు, శ్రీనివాస రావు, గద్ద మడుగు గ్రామస్తులు మడకం నాగేశ్వరరావు విద్యార్థిని తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Post A Comment: