CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కంది సుబ్బారెడ్డి అభినందనీయుడు. 80 సంవత్సరాల వయసులో వినూత్న వ్యవసాయం అమృత్ మహోత్సవం కార్యక్రమంలో ఉత్తమ రైతుగా సన్మానం.

Share it:

 



మన్యం మనుగడ, పినపాక:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డిని ఉత్తమ రైతుగా కొత్తగూడెంలో జరిగిన అమృత్ మహోత్సవ కార్యక్రమంలో సన్మానించారు.ఎన్నో సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తూ మంచి లాభాలు పొందిన కంది సుబ్బారెడ్డి ఎనభై ఏళ్ల వయసులోనూ, కొత్త తరహా వ్యవసాయం వైపు అడుగులు వేస్తూ కొత్త రకం పంటల ను పండిస్తున్నారు. ఆపిల్ బేర్, తైవాన్ జామ, రకాలు, కూరగాయలను సేంద్రియ పద్ధతుల్లో పండిస్తు మంచి లాభాలను పొందుతూ ముందు తరాలకు,సాటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు అని జిల్లా వ్యవసాయ అధికారి అభిమన్యుడు కొనియాడారు. ఈ సందర్భంగా కంది సుబ్బారెడ్డిని శాలువాతో సత్కరించి, పురస్కారం అందజేశారు.


ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి మరియన్న ,కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ లక్ష్మి నారాయణమ్మ , జిల్లా లోని అందరూ సహాయ వ్యవసాయ సంచాలకులు, పినపాక మండల వ్యవసాయ అధికారి ఈ. వేంకటేశ్వర్లు , వ్యవసాయ విస్తరణ అధికారులు కొమరం లక్ష్మణ్ రావు, రమేష్ , జిల్లాలోని తదితర ప్రాంతాల నుండి వచ్చిన రైతులు పాల్గొన్నారు.


Share it:

TS

Post A Comment: