గుండాల ఏప్రిల్ 18(మన్యం మనుగడ) మండలంలో ప్రతియేటా ప్రజలు వేసవిలో తునికాకు సేకరిస్తారు. సోమవారం మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో కొనుగోలు చేసే సేట్లతో చర్చలు జరిపి 50కలకత్తాకు రెండు రూపాయల 7 పైసలు గా ధరను నిర్ణయించారు. సేకరణ ప్రభుత్వం మరియు ప్రైవేట్ సేట్లలు కొనుగోలు చేస్తారు. తునికాకు సేకరించే సమయములో ప్రమాదాల బారిన పడితే ప్రథమ చికిత్స తో పాటు మెరుగైన వైద్యం అందించాలని ప్రమాదవశాత్తు మరణిస్తే ఎక్స్గ్రేషియా చెల్లించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సేట్లు ముప్పిడి సర్వోత్తమ రెడ్డి, సంపత్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, అఖిలపక్ష నాయకులు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, అవును మరి మధు, చంద్రన్న , మాచర్ల సత్యం, కోడెం వెంకటేశ్వర్లు, కొమరం సత్యనారాయణ, బి.సత్యం, మల్లయ్య , సమ్మయ్య , రమేష్ ,పి. శ్రీనివాస్, ముంతాజీములు అజ్జు, ఖుద్దూస్, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: