మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సింగరేణి కాలరీస్, ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్-2 గనిలో కాంట్రాక్ట్ కార్మికునిగా పనిచేస్తూ ఇటీవల అనారోగ్యానికి గురైన మడికంటి.కుమార్ వైద్య చికిత్సకు ఓసి-2 పంప్ సెక్షన్ కార్మికులు ఎనిమిది వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని మంగళవారం ఉదయం పీకే ఓసి ప్రాజెక్ట్ మేనేజర్ మాలోత్ రాముడు చేతుల మీదుగా బాధితుడు కుమార్ కు అందజేశారు.ఈ సందర్భంగా ముఖ్య అతిధి గా పాల్గొన్న మాలోత్ రాముడు మాట్లాడుతూ,పంపు సెక్షన్ కార్మికులను సూపర్వైజర్ లను అధికారులను అభినందించారు.ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుమార్ కి సహాయం చేయాలనే ఆచరణాత్మక ఆలోచన ప్రశంసనీయమన్నారు.ఇతర కార్మికులు సూపర్వైజర్లు కూడా స్పందించి కుమార్ ని ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పంప్ సెక్షన్ ఇంచార్జ్ జీ ఎస్.నజీర్,పీకే ఓసి రక్షణాధికారి మెరుగు. లింగబాబు,సూపర్వైజర్లు కె వి అప్పలరాజు,జరపల శ్రీనివాస్, నాయకులు,పుట్టాల శ్రీనివాస్, వత్సవాయి కృష్ణంరాజు, కార్మికులు జి మల్లయ్య,పి నాగరాజు,అభిలాష్,మోసిన్ ఖాన్,చంద్రశేఖర్ సింగరేణి సేవా సమితి సభ్యులు నాసర్ పాషా తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: