గుండాల/ఆళ్లపల్లి ఏప్రిల్ 27(మన్యం మనుగడ) ఘనంగా టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్కె బాబా జెండా ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారని అన్నారు. నీళ్లు నిధులు నియామకాలను సమతూకంలో అందిస్తున్నారని ఆయన అన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, 24 గంటల ఉచిత విద్యుత్, కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్, రెండు పడకల ఇండ్లను అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ చెందుతున్నారు. పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆధ్వర్యంలో నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. కోపరేటివ్ చైర్మన్ రామయ్య, ఆత్మ కమిటీ డైరెక్టర్ లక్ష్మయ్య, ఓపెన్ డైరెక్టర్ సాంబశివరావు, పార్టీ నాయకులు శ్రీనివాస్, బుర్ర వెంకన్న మైనార్టీ నాయకులు ఆదం, నరెడ్ల ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: