CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.21వ వార్షికోత్సవ వేడుకలు. టౌన్ అధ్యక్షులు ఎండి ఖాజా పాషా ఆధ్వర్యంలో జరిగిన వేడుకలు.

Share it:

 



మన్యం మనుగడ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో తెలంగాణ తల్లి సెంటర్ లో బుధవారం టిఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ వేడుకలు టౌన్ అధ్యక్షులు ఎండి ఖాజా పాషా ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి, కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.అనంతరం జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండి వలీయాబీ, సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి మాట్లాడుతూ.2001 ఏప్రిల్ 27 తారీఖున హైదరాబాదులో పిడికెడు మంది నాయకులతో ఆనాడు ఏర్పాటు చేసిన పార్టీ ఇంతింతై వటుడింతై ఆకాశమంత అయినట్టు,

టిఆర్ఎస్ పార్టీ కూడా రాష్ట్ర సాధన లక్ష్యం పూర్తిచేసి లక్ష్యాన్ని ముద్దాడిందని,కెసిఆర్ నాయకత్వంలో రోజు రోజుకీ అభివృద్ధి చెందుతూ ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా,రాష్ట్రంలో జాతీయ పార్టీల కంటే అతి పెద్ద బలమైన పార్టీగా అవతరించిందని అన్నారు. రాష్ట్రంలో కొనసాగుతు దేశవ్యాప్తంగా కూడా విస్తరించి అన్ని రాష్ట్రాలలో కెసిఆర్ నాయకత్వాన్ని కోరుకునే విధంగా ఎదుగుతున్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం మండల పిఎసిఎస్ చైర్మన్ కునూరు అశోక్ గౌడ్, స్థానిక సర్పంచ్ ఈసం రామ్మూర్తి,సీనియర్ నాయకులు సయ్యద్ సర్దార్ పాషా,దడిగల సమ్మయ్య, సిద్దబోయిన రాంబాబు,కావేరి చిన్ని కృష్ణ,సప్పిడి రామ నరసయ్య,ఎంపీటీసీ సభ్యులు కుమ్మరి స్వప్న చంద్రబాబు, మాజీ ఎంపీపీ తూరం పద్మ, అనుబంధ సంఘాల అధ్యక్షులు ఎండి అరిఫ్,బట్టు రమేష్,వావిలాల రాంబాబు, గండేపల్లి నరసయ్య,మాదరి రామయ్య,చాంద్ పాషా,పొడేం శోభన్,పల్ల రఘు,గుర్రం కనకయ్య,చిప్ప అశోక్,చందా లక్ష్మీనారాయణ,కాళ్ల రామకృష్ణ,కొండాయి చిన్ని, వావిలాల పోశయ్య,కందకట్ల శ్రీనివాస్,దడిగల లక్ష్మణ్, ఆబిద్,బాబా,రవీందర్, సయ్యద్ సఫియా తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: