మన్యం మనుగడ కరకగూడెం: టిఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని మండల వ్యాప్తంగా వివిధ గ్రామాలలో టిఆర్ఎస్ పార్టీ గులాబి తోరణాలు కట్టి గులాబీ జెండాలను వివిధ గ్రామ గ్రామాల టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు టిఆర్ఎస్ పార్టీ సర్పంచులు గులాబీ జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు పాయం.నరసింహారావు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ ఏర్పడి 21 సంవత్సరం పూర్తి చేసుకొని 22 వ సంవత్సరంలో అడుగు పెట్టడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అలాగే తెలంగాణ గుండె చప్పుడు తెలంగాణ ప్రజల కొరకు అనునిత్యం శ్రమించే వ్యక్తి టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు సీఎం కేసీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీల సర్పంచులు గ్రామ కమిటీ అధ్యక్షులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: