దమ్మపేట ఏప్రిల్ 27 ( మన్యం మనుగడ ): దమ్మపేట మండల పరిధిలో తెరాస పార్టీ 21 వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ముష్టిబండ గ్రామ శాఖ అధ్యక్షులు గుర్రాల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలలు వేసి కేసీఆర్ నాయకత్వం వర్ధిలాలి అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధానకార్యదర్శి దొడ్డా రమేష్,మండల యూత్ ప్రధానకార్యదర్శి కూకలకుంట కిషోర్,మండల యూత్ నాయకులు రావు పండు,నాయకులు మోరంపూడి రాఘవరావు,కూకలకుంట రంగారావు,కొల్లి చౌదరి పాల్గొన్నారు అలాగే పట్వారీగూడెం గ్రామంలో జెండా ఎగరవేసి వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రాయల నాగేశ్వరరావు చిట్టి నారాయణ పల్లికొండ నాగేశ్వరరావు చెలికాని రాంబాబు మొదలగువారు పాల్గొన్నారు అలాగే అన్ని పంచాయతీలలో జెండావిష్కరణ చేసే సంబరాలు జరుపుకున్నారు
Post A Comment: