- పిప్త్ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసి చట్టాలు అమలు ఎక్కడ..!?
- ఆదివాసీల ఐక్యతను, ఆదివాసీల ఆత్మ గౌరవాన్ని, క్షీణింప చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
మన్యం మనుగడ వాజేడు.
అయ్యవారిపేట, ధర్మారం, భువనపల్లి, గ్రామాలకు చెందిన నిరుపేద స్థానిక ఆదివాసి కుటుంబాలు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అర్హత కలిగిన ఆదివాసి కుటుంబాలతో ఇసుక క్వారీలను 24/03/2011 లో జీ ఓ ఎమ్ ఎస్ నెంబర్_ 66 ప్రకారం 1/70, పెసా చట్టం ప్రకారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం కో-ఆపరేటివ్ యాక్ట్ ప్రకారం 1964లో ఒక ఇసుక క్వారీ సొసైటీ సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. భద్రాచలం ఐటిడిఎ పిఓ ఆదేశాల మేరకు, పెసా గ్రామసభల ఆమోదం పొందిన తర్వాత, ఈసీ, టి ఎస్ ఎన్ డి సి, అగ్రిమెంట్ చేసుకొని గోదావరిలో నుండి డంపింగ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న, గిరిజన సొసైటీలను అమాయకపు ఆదివాసీలను, ఆదివాసీల అభివృద్ధికి అడ్డుకోవాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న, కొన్ని గిరిజనేతర శక్తులను ప్రేరేపించే, వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ధర్మారం, అయ్యవారిపేట, భువన పల్లి, ఆదివాసి నిరుపేద స్థానిక కుటుంబాలు వాజేడు తహసిల్దార్ అల్లం రాజ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. అయ్యవారిపేట, ధర్మారం, భువనపల్లి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: