బొగ్గు పరిశ్రమలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరికీ వెజ్ బోర్డు వర్తింపు కై, ఒకటవ కేటగిరి వేతనం అమలుకై జే బిసిసిఐ సమావేశాల సందర్భంగా ఈ నెల 16న నిర్వహించే ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర కార్యదర్శి డి. ప్రసాద్ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల ను కోరారు. సోమవారం స్థానిక ఐ.ఎఫ్.టి.యు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
సింగరేణికాలరీస్,కాంట్రా క్ట్ వర్కర్స్ యూనియన్
(SCCWU-IFTU) ఆన్లైన్ సమావేశం షేక్ యాకుబ్ షావలి* రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షతన జరిగిందని రాష్ట్రకమిటీస మావేశం పిలుపుమేర కు సింగరేణి వ్యాప్తంగా *ఈనెల16నఢిల్లీ లో*JBCCI సమావే శంసందర్భంగా* *సింగరేణిలో 4నుండి 6 వరకు ప్రెస్ మీట్ లు* *7నుండి 11 వరకు జిఎంలకు* *వినతిపత్రాలు*12న* *డైరెక్టర్ పా కు వినతి* *పత్రం 16న ఢిల్లీ కోల్ భవన్ ముందు ధర్నాను చేయాలని నిర్ణయించడం జరిగింది అని, ఈ ధర్నాను జయప్రదం చేయాల్సిందిగా* సింగరేణి లోని అన్ని విభాగాల కాంట్రా క్టు కార్మికులకువిజ్ఞప్తి చేశారు.
సమావేశంలో సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర ఉపాధ్యక్షులు యన్.సంజీవ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి, ఐ.ఎఫ్.టి.యు జిల్లా కోశాధికారి గోనెల. రమేష్, రీజియన్ అధ్యక్షులు పి. సతీష్, మణుగూరు బ్రాంచ్ కార్యదర్శి ఎండీ. గౌస్, బ్రాంచ్ కమిటీ సభ్యులు ఎం. శ్రీనివాసరెడ్డి, చారి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: