మన్యం టీవీ చర్ల:
చర్ల మండలంకు చెందిన హైకోర్ట్ అడ్వకేట్ సి వి సతీష్ కుమార్ ఈ రోజు తన నివాసం వద్ద దుమ్ముగూడెం మండలంలోని చినబండీరేవు గ్రామానికి చెందిన కేతవరపు శ్రీనివాసరావు, శైలజ దంపతుల కుమార్తె చరిత నీట్ పరీక్షలో 531 మార్కులు సాధించి ఆలిండియా స్థాయిలో 59760 ర్యాంకు తో యంబీబీఎస్ ఉచిత సీటుకు అర్హత సాధించింది.
యంబీబీఎస్ సీటు సాధించిన చరితకు చింతలచెర్వు వెంకటాద్రి ట్రస్టు ద్వారా సీవీకే రావు తనయుడు హైకోర్టు అడ్వకేట్ సీవీ సతీష్ కుమార్ రూ 5 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు.అదేవిధంగా చర్ల మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థీనిలకు చెరో 5 వేల చొప్పున పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దొడ్డా ప్రభుదాస్,శివరాజ్ కిషోర్, తోటమల్ల. రమణమూర్తి. పాల్గొన్నారు
Post A Comment: