సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ సమావేశం కొత్తగూడెం AITUC కార్యాలయంలో గురువారం నాడు జరిగినది.ఈ సమావేశంలో ఈ క్రింది విధంగా దశల వారీ పోరాటానికి సిద్ధం కావాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈనెల 19వ తేదీన కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ తో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి ఒప్పందం చేసుకోవాల్సి ఉండగా సింగరేణి యాజమాన్యం మరియు లేబర్ అధికారులు ఏకపక్షంగా చర్చలను వాయిదా వేయడాన్ని నిరసిస్తూ సింగరేణి వ్యాప్తంగా పోరాటానికి సిద్ధం కావాలని, తక్షణమే చర్చలు నిర్వహించి ఫిబ్రవరి 9వ తేదీన ఇచ్చిన హామీలను అమలు జరపాలని, లేనియెడల మే 10వ తేదీ తర్వాత ఏ రోజు నుండి అయినా నిరవధిక సమ్మెకు సింగరేణిలో అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులు సిద్ధం కావాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో AITUC నుండి గుత్తుల సత్యనారాయణ,CITU సీఐటీయూ నుండి బి.మధు యర్రగాని కృష్ణయ్య IFTU నుండి అర్. మధుసూదన్ రెడ్డి, పి సతీష్,INTUC నుండి కే నాగభూషణం,IFTU నుండి కె.విశ్వనాథ్, మారుతీరావు,IFTU నుండీ తోకల రమేష్, కె. సురేందర్,HMS నుండి జి. రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
*నిర్ణయాలు*
*మే 4,5 తేదీల్లో నిరసన బ్యాడ్జీలు ధరించాలి,
*మే 7వ తేదీన అన్ని జిఎం కార్యాలయాల వద్ద జేఏసీగా ధర్నాలు చేయాలి. *మే 8వ తేదీన కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇవ్వాలి.
*మే 10వ తేదీ లోగా చర్చలు జరపాలని, లేనియెడల 10వ తేదీ తర్వాత నిరవధిక సమ్మెలోకి వెల్లటానికి కార్మికులు సిద్ధం కావాలి.
*సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ*
Post A Comment: