మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని ఏ ఎస్పీ కార్యక్రమంలో బుధవారం ఏ ఎస్పీ శబరిష్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఏ ఎస్పీ శబరిష్ మాట్లాడుతూ,మణుగూరు లో భారీగా గుట్కా పట్టుబడింది అని తెలిపారు.చత్తీస్ఘడ్ రాష్ట్రం నుంచి మణుగూరు కు తీసుకువచ్చి గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తూ ఉండగా ఐదుగురు ని అరెస్టు చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అని,వారి వద్ద నుండి రూ.10 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.కార్యక్రమంలో సిఐ ముత్యం రమేష్,ఎస్ఐ పురుషోత్తం,ట్రైనీ ఎస్సై పిఎన్ రావు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: